Site icon NTV Telugu

ఓటిటీ బాట పట్టనున్న అక్కినేని హీరో కొత్త సినిమా..?

malli modalindi

malli modalindi

అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ గ్రూప్ భారీ మొత్తంలో ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. పెళ్ళైన జంట కొన్ని విభేదాల వలన విడాకులు తీసుకుంటారు. విడాకుల తరువాత ఆ వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను వినోదాత్మకంగా చూపించినట్లు డైరెక్టర్ తెలిపారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాలి.

Exit mobile version