ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కాగా, గర్భిణులు టీకా వేసుకొచ్చా? లేదా..? అనేది ఇంతవరకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే తాజాగా గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్లారిటీ ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిందని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ చెప్పారు. ప్రెగ్నెంట్లు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతున్న టైమ్లో కేంద్రం ఈ గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇంతకుముందు వరకు పాలిచ్చే తల్లులకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వ్యాక్సిన్ వేస్తే తల్లీపిల్లలకు ప్రమాదం ఎక్కువనే ప్రచారాన్ని కొట్టిపారేసింది. ప్రమాదం కన్నా ఉపయోగమే ఎక్కువని వివరించింది. వ్యాక్సిన్ వేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాలు గర్భిణులకు వివరించాలని చెప్పింది.
గర్భిణులు.. ఇక ఆ భయం వద్దు
