RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
- రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు
- దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై, 2026 జూలై 29 చివరి తేదీ వరకు
- బి.ఎస్.సి./బి.టెక్./బి.ఇ./3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు భారతీయ రైల్వే తీపికబురును అందించింది. ఏకంగా 6 వేలకు పైగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 6,565 ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయడానికి షాట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై, 2026 జూలై 29 చివరి తేదీ వరకు కొనసాగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం, ఆర్ఆర్బి 323 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు, 6242 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హతలు
Also Read
- NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ఆర్.ఆర్.బి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సంబంధిత రంగంలో బి.ఎస్.సి./బి.టెక్./బి.ఇ./3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. 33 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటిఐ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకానికి ఎంపిక కావడానికి, అభ్యర్థులు ముందుగా CBT పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. విజయవంతమైన అభ్యర్థులను ఆ తర్వాత పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్ష కోసం ఆహ్వానిస్తారు. అన్ని దశలలోనూ ప్రతిభచూపిన అభ్యర్థులకు ఖాళీగా ఉన్న స్థానాలలో నియామకాలు చేపట్టడం జరుగుతుంది.
ఈ నియామకం ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 జీతం లభిస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 జీతం లభిస్తుంది. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu Singapore Visit: సింగపూర్లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ..
-
Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?