కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసింది.. తాజాగా ప్రముఖ సంస్థ బెల్ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.. ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 205 పోస్టుల ను భర్తీ చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2023. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు..
ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 205 పోస్టులను భర్తీ చెయ్యడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..వీటిలో 191 ఖాళీలు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులు కాగా.. మరో 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ – I పోస్టులు ఉన్నాయి. . వివరాలను తెలుసుకోవడానికి.. మీరు అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నోటీసును చూడవచ్చు. మీరు నోటిఫికేషన్ చూసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి..
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BE, B.Tech, B.Sc (నాలుగేళ్లు) డిగ్రీని పొంది ఉండాలి. లేదా ఇంజినీరింగ్ కు సంబంధించిన మరేదైనా కోర్సు చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి 55 శాతం మార్కులు ఉండటం కూడా అవసరం..
వయస్సు..
32 సంవత్సరాలుగా మరియు ట్రైనీ ఇంజనీర్ I పోస్టుకు వయోపరిమితిని 28 సంవత్సరాలుగా నిర్ణయించారు..
ఇంటర్వ్యూ..
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు వెళతారు.. ఈ రెండింటిలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు.. గతంలో కూడా ఇంజనీరింగ్ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
