WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక

  • వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
  • ప్రమాదకర ఎల్‌నినో రాబోతుందంటూ వార్నింగ్
  • ఈ ఏడాది వర్షాలు తక్కువ ఉంటాయని సూచన
Wmo

Wmo

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలోకి ప్రమాదకరమైన ఎల్‌నినో రాబోతుందని.. దీంతో రుతుపవనాలు బలహీనపడతాయని వార్నింగ్ ఇచ్చింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వడగాలులు, కరవులు ఏర్పడతాయని.. ఇక భారతదేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని సూచించింది.

వాస్తవానికి గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో నదులు, భూగర్భ జలాలు సంపూర్ణంగా నిండాయి. దీంతో పాడి పంటలు సమృద్ధిగా పండాయి. కానీ ఈ ఏడాది ఇంకా తొలకరి పలకరించలేదు. ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి.

×
×
Ad

ఇలాంటి తరుణంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నుంచి వెలువడిన ఒక కీలక నివేదిక ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, విధాన రూపకర్తలను అప్రమత్తం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని డబ్ల్యూఎంఓ అధికారికంగా ధృవీకరించింది. ఈ కాలానుగుణ మార్పు రాబోయే నెలల్లో ప్రపంచ ఉష్ణోగ్రత, వర్షపాత సరళిని పూర్తిగా మార్చివేయనుంది. శాస్త్రవేత్తల అంచనా నమూనాల ప్రకారం.. 2026 ఎల్ నినో ఒక సాధారణ సంఘటనగా ఉండబోదని.. బదులుగా అది ‘మితమైన నుంచి చాలా బలమైనదిగా’’ ఉండే అవకాశం ఉందని సూచించింది.

భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని అసాధారణంగా వెచ్చని జలాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికే వేడెక్కుతున్న ప్రపంచానికి ఎల్ నినో మరింత ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇవి వేగంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వ్యవసాయాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు.

ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దక్షిణాసియాలో రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది. భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి రుతుపవనాలు జీవనాధారం. బలహీనమైన రుతుపవనాల ప్రభావం పంట ఉత్పత్తి, నీటి లభ్యత, ఆహార భద్రతపై నేరుగా పడుతుంది. తగ్గిన వర్షపాతం కరవుకు దారితీసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.