Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..
- అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..
- అమెరికన్ వస్తువులపై 125 శాతం సుంకాలు పెంచిన చైనా..
- యూఎస్కి ప్రతిస్పందనగా చైనా నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tariffs War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచారు. మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలలు పాటు టారిఫ్స్ని నిలిపేసింది. కానీ, చైనాకు మాత్రం అమెరికా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. చైనా ఉత్పత్తులపై యూఎస్ విపరీతమైన సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే, చైనా కూడా అంతే ధీటుగా అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతూ పోతోంది. తాజాగా, యూఎస్ వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతామని చైనా శుక్రవారం తెలిపింది.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్గా నాగేంద్రన్.. రేపు ప్రకటించే ఛాన్స్!
Also Read
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
- China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
మరోవైపు, శనివారం నుంచి చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలు 145 శాతం అమలులోకి వస్తున్నాయి. అమెరికా నిర్ణయానికి ధీటుగా చైనా కూడా స్పందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇదిలా ఉంటే, అమెరికా టారిఫ్ దెబ్బకు కలిసి పనిచేద్ధామని భారత్ని చైనా కోరింది. అమెరికా సుంకాలను అడ్డుకోవాలని చెప్పింది. తాజగా, యూరోపియన్ యూనియన్కి చైనా కలిసి పనిచేయాలని, అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య యుద్ధం నుంచి బయటపడటానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనా మరియు యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలి, ఏకపక్ష బెదిరింపు పద్ధతులను సంయుక్తంగా నిరోధించాలి” అని చైనా అధ్యక్షుడు చెప్పారు.
అంతకుముందు, భారత్ కూడా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చైనా కోరింది. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని జిన్పింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరాడు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఉన్నాయని, ఆమెరికా సుంకాల దుర్వినియోగం చేస్తోందని, ఇది ఇరు దేశాల అభివృద్ధి హక్కును, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కలిసి నిలబడాలని అని ఇండియాలో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!