Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
- బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను
- ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
- అవామీ లీగ్ను ఎవరూ అంతం చేయలేరు: షేక్ హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2024లో బంగ్లాదేశ్లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం వల్ల తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. “నేను దేశంలో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు. బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అతి త్వరలోనే నేను మళ్లీ నా సొంత దేశానికి తిరిగి వెళ్తాను” అని వెల్లడించారు. తనపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అవామీ లీగ్పై ప్రస్తుత ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు.
ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
ఈ సందర్భంగా ఆమె తన సొంత దేశానికి వెళ్లడానికి ఒక నిర్దిష్ట తేదీ, సమయం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. “ముందుగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వాతావరణం, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన తిరిగి రావాలి. ఇది కేవలం నా పునరాగమనం కోసం మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రం – ప్రజల సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు. అలాగే తన పార్టీ అయిన ‘అవామీ లీగ్’ పై విధించిన నిషేధం గురించి మాట్లాడుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. కాగితపు ఆదేశాలతో పార్టీలు అంతం కావని స్పష్టం చేశారు. “అవామీ లీగ్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్తో దానిని క్లోజ్ చేయడం ఎవరి తరం కాదు. అదే నిజమైతే అసలు బంగ్లాదేశ్ అనే దేశమే పుట్టేది కాదు” అని గుర్తుచేశారు.
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
“గతంలో నాపై 19 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఎప్పుడూ భయపడి ఆగిపోలేదు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో లక్షలాది మంది మద్దతుదారులు, వేలాది మంది నాయకులు పార్టీ కోసం నిలబడే ఉన్నారు” అని చెప్పారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనుస్పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ” గతంలోని యూనుస్ ప్రభుత్వం తమ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై పగబట్టి ‘రాజకీయ నరమేధం’ సృష్టించింది. ఇప్పటివరకు మా పార్టీకి చెందిన సుమారు 600 మంది నాయకులను, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మందిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతోమంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగానే నాయకులంతా మళ్లీ తిరిగి వస్తారు” అని చెప్పారు.
భారత్తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంతో ఉన్న సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. “భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనది. భారత్ కేవలం మా పొరుగు దేశం మాత్రమే కాదు, మా దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ దేశం అందించిన సహకారం మరువలేనిది” అని కొనియాడారు. అయితే బంగ్లాదేశ్లో కొన్ని రాజకీయ, తీవ్రవాద గ్రూపులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఎప్పటి నుంచో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!