Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
- బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను
- ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
- అవామీ లీగ్ను ఎవరూ అంతం చేయలేరు: షేక్ హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2024లో బంగ్లాదేశ్లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం వల్ల తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. “నేను దేశంలో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు. బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అతి త్వరలోనే నేను మళ్లీ నా సొంత దేశానికి తిరిగి వెళ్తాను” అని వెల్లడించారు. తనపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అవామీ లీగ్పై ప్రస్తుత ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు.
ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
ఈ సందర్భంగా ఆమె తన సొంత దేశానికి వెళ్లడానికి ఒక నిర్దిష్ట తేదీ, సమయం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. “ముందుగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వాతావరణం, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన తిరిగి రావాలి. ఇది కేవలం నా పునరాగమనం కోసం మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రం – ప్రజల సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు. అలాగే తన పార్టీ అయిన ‘అవామీ లీగ్’ పై విధించిన నిషేధం గురించి మాట్లాడుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. కాగితపు ఆదేశాలతో పార్టీలు అంతం కావని స్పష్టం చేశారు. “అవామీ లీగ్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్తో దానిని క్లోజ్ చేయడం ఎవరి తరం కాదు. అదే నిజమైతే అసలు బంగ్లాదేశ్ అనే దేశమే పుట్టేది కాదు” అని గుర్తుచేశారు.
Also Read
- US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
- US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
“గతంలో నాపై 19 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఎప్పుడూ భయపడి ఆగిపోలేదు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో లక్షలాది మంది మద్దతుదారులు, వేలాది మంది నాయకులు పార్టీ కోసం నిలబడే ఉన్నారు” అని చెప్పారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనుస్పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ” గతంలోని యూనుస్ ప్రభుత్వం తమ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై పగబట్టి ‘రాజకీయ నరమేధం’ సృష్టించింది. ఇప్పటివరకు మా పార్టీకి చెందిన సుమారు 600 మంది నాయకులను, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మందిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతోమంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగానే నాయకులంతా మళ్లీ తిరిగి వస్తారు” అని చెప్పారు.
భారత్తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంతో ఉన్న సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. “భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనది. భారత్ కేవలం మా పొరుగు దేశం మాత్రమే కాదు, మా దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ దేశం అందించిన సహకారం మరువలేనిది” అని కొనియాడారు. అయితే బంగ్లాదేశ్లో కొన్ని రాజకీయ, తీవ్రవాద గ్రూపులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఎప్పటి నుంచో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Prabhas : రెబెల్ స్టార్ ఫౌజీ.. ఆ సీన్స్ మాములుగా ఉండవట
-
Samantha : రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లోకి “మా ఇంటి బంగారం”… సమంత ఆ కష్టాన్ని గట్టెక్కినట్టేనా ?
-
Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
-
OnePlus 15R: వన్ప్లస్ 15ఆర్ 16GB RAM వేరియంట్ రిలీజ్.. 7,400mAh బ్యాటరీ
-
Malayalam Cinema : మనకు సంక్రాంతి.. కేరళకు ‘ఓనం’.. స్టార్ హీరోలు పోటాపోటీ రిలీజ్
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!