Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
- బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను
- ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
- అవామీ లీగ్ను ఎవరూ అంతం చేయలేరు: షేక్ హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2024లో బంగ్లాదేశ్లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం వల్ల తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. “నేను దేశంలో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు. బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అతి త్వరలోనే నేను మళ్లీ నా సొంత దేశానికి తిరిగి వెళ్తాను” అని వెల్లడించారు. తనపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అవామీ లీగ్పై ప్రస్తుత ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు.
ప్రజాస్వామ్యం పునరుద్ధరణే నా లక్ష్యం
ఈ సందర్భంగా ఆమె తన సొంత దేశానికి వెళ్లడానికి ఒక నిర్దిష్ట తేదీ, సమయం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. “ముందుగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వాతావరణం, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన తిరిగి రావాలి. ఇది కేవలం నా పునరాగమనం కోసం మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రం – ప్రజల సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు. అలాగే తన పార్టీ అయిన ‘అవామీ లీగ్’ పై విధించిన నిషేధం గురించి మాట్లాడుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. కాగితపు ఆదేశాలతో పార్టీలు అంతం కావని స్పష్టం చేశారు. “అవామీ లీగ్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్తో దానిని క్లోజ్ చేయడం ఎవరి తరం కాదు. అదే నిజమైతే అసలు బంగ్లాదేశ్ అనే దేశమే పుట్టేది కాదు” అని గుర్తుచేశారు.
Also Read
- AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
- Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
- US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
- Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్పై కొత్త దాడులకు బ్రేక్..
“గతంలో నాపై 19 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఎప్పుడూ భయపడి ఆగిపోలేదు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో లక్షలాది మంది మద్దతుదారులు, వేలాది మంది నాయకులు పార్టీ కోసం నిలబడే ఉన్నారు” అని చెప్పారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనుస్పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ” గతంలోని యూనుస్ ప్రభుత్వం తమ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై పగబట్టి ‘రాజకీయ నరమేధం’ సృష్టించింది. ఇప్పటివరకు మా పార్టీకి చెందిన సుమారు 600 మంది నాయకులను, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మందిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతోమంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగానే నాయకులంతా మళ్లీ తిరిగి వస్తారు” అని చెప్పారు.
భారత్తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంతో ఉన్న సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. “భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనది. భారత్ కేవలం మా పొరుగు దేశం మాత్రమే కాదు, మా దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ దేశం అందించిన సహకారం మరువలేనిది” అని కొనియాడారు. అయితే బంగ్లాదేశ్లో కొన్ని రాజకీయ, తీవ్రవాద గ్రూపులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఎప్పటి నుంచో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?