NTV Telugu Site icon

Bangkok: ఘోర విషాదం.. స్కూల్ బస్సు దగ్ధమై 25 మంది విద్యార్థుల సజీవదహనం

Bane

Bane

బ్యాంకాక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.