Benjamin Netanyahu: విజయానికి అడుగు దూరం, అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు: ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మంది చంపేసింది. మరో 240 మందిని కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్పై యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజుతో ఈ యుద్ధం ప్రారంభమై 7 నెలలు కావస్తోంది. ఇప్పటికే వందలాది మంది బందీలు హమాస్ చెరలోనే ఉండగా.. అమాయకమైన పాలస్తీనా ప్రజలు 33,000 మంది మరణించారు.
ఇదిలా ఉంటే సంధి కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నా కూడా కాల్పుల విరమణ కుదరడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. విజయానికి అడుగుదూరంలోనే ఉన్నామని, అప్పటి వరకు కాల్పుల విరమణ ఉండదని స్పష్టం చేశారు. హమాస్ బందీలందరిని విడిచిపెట్టే వరకు సంది ఉండదని చెప్పారు. ఈ దాడిలో మేము చాలా మూల్యాన్ని చెల్లించామని ఆయన అన్నారు. బందీలు తిరిగి రాకుండా కాల్పుల విరమణ ఉండదని చెప్పారు.
Also Read
Read Also: Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయిల్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది, కానీ లొంగిపోవడానికి కాదని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్పై అంతర్జాతీయ ఒత్తిడి హమాస్ తన స్థావరాలను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కారణమవుతుందని, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి హమాస్కి వ్యతిరేకంగా ఉండాలని, ఇది బందీల విడుదల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఏప్రిల్ 1న గాజాలో వైమానిక దాడిలో యూఎస్ ఫుడ్ ఛారిటీ వరల్డ్ కిచెన్కి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు. దీంతో అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఇజ్రాయిల్పై ఆగ్రహంతో ఉన్నాయి. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహూకి ఫోన్ చేసి తక్షణం కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా అనేక దాడుల వెనక ఇరాన్ తన ప్రాక్సీలను ఉంచుతోందని నెతన్యాహూ ఆరోపించారు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!