Netanyahu: నెతన్యాహుకు అవమానం.. ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగం..
- నెతన్యాహుకు అవమానం..
- ఐరాసలో ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగం..
- నెతన్యాహూ స్పీచ్ సమయంలో ప్రతినిధుల వాకౌట్..
- కొన్ని దేశాల తీరుపై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ, ఇజ్రాయిల్ గాజాలో ‘‘పనిని పూర్తి చేస్తుంది’’, సాధ్యమైనంత త్వరగా చేస్తుందని ప్రకటించారు. తన ప్రసంగాన్ని పాలస్తీనియన్లు అందరు వినాలని గాజా స్ట్రిప్ చుట్టూ లౌడ్ స్పీకర్లు ఉంచాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని నెతన్యాహూ ఆదేశించారు. అరబ్, ముస్లిం దేశాల నుంచి దాదాపు అందరు ప్రతినిధులు ప్రసంగం సమయంలో వాకౌట్ చేశారు. అనేక ఆఫ్రికన్ దేశాలు, యూరప్ దేశాల ప్రతినిధులు కూడా బయటకు వెళ్లారు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
దీనికి ముందు ఒక రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్కు వీసా నిరాకరించింది. దీంతో ఆయన జనరల్ అసెంబ్లీలో రిమోట్గా ప్రసంగించారు. ప్రజలు ఎన్ని బాధలు అనుభవించినా, పాలస్తీనియన్లు గాజాను ఎప్పటికీ వదిలి వెళ్లరని అన్నారు. ఇజ్రాయిల్ నిఘా విభాగం గాజా అంతటా వినిపించేలా నెతన్యాహు ప్రసంగాన్ని ప్రసారం చేసింది. హమాస్ నాయకులు లొంగిపోవాలని, ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను వదిలేయాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్ను విమర్శిస్తున్న దేశాలకు నెతన్యాహూ చాటా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పక్షపాత మీడియా, రాడికల్ ఇస్లామిస్ట్, సెమిటిక్ వ్యతిరేక మూకలకు వారు లొంగిపోయారని అన్నారు. ‘‘పరిస్థితులు కఠినంగా మారినప్పుడు, ధైర్యవంతులు ముందుకు సాగుతారు. కానీ ఇక్కడ చాలా దేశాలు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, వెనక్కి తగ్గి లొంగిపోయారు’’ అని నెతన్యాహూ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!