Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..

  • రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున మాస్కో ప్రాంతంలో డ్రోన్ దాడి.
  • 1,000కి పైగా డ్రోన్లు ఉపయోగించి అటాక్స్.
  • చమురు శుద్ధి కర్మాగారంలో అగ్నిప్రమాదం.
  • దాడికి ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపణలు.
Ukraine War

Ukraine War

Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి పాల్పడింది. రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున మాస్కోపై డ్రోన్ దాడి జరిగింది. 1000కి పైగా డ్రోన్లలో ఉక్రెయిన్ మాస్కోపై విరుచుకుపడింది. ఈ డ్రోన్ దాడిలో మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారం దెబ్బతింది. దాడి తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఈ దాడి రష్యాను గణనీయంగా దెబ్బతీసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యాకు చెందిన ఒక చమురు ఉత్పత్తి కేంద్రం, లాజిస్టిక్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు చెప్పారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఈ లాజిస్టిక్ కేంద్రాలు కీలకంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో FP-1, RZ-100, MICH-2000, పాలియానిట్సియా, వెండెట్టా, లియుటి, బార్స్, ఫ్లెమింగో, సిచెన్, పెలికాన్ వంటి వ్యవస్థలను ఉపయోగించారు. యుద్ధాన్ని ముగించేందుకు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని రష్యాకు జెలెన్స్కీ సూచించారు. ఇంధనం, ఆహార భద్రత రంగాలలో ఉద్రిక్తతల్ని తగ్గించే మార్గాలు ఉన్నాయని, దీనికి రాజకీయ సంకల్పం అవసరమని చెప్పారు.

రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజు ఈ దాడి జరిగింది. ఈ ఎన్నికలు ఉక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి ఓ పరీక్షగా నిలిచాయి. రష్యా ఈ దాడికి ఉక్రెయిన్‌ను నిందించింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యా నిర్వహిస్తున్న ఎన్నికల్ని తిరస్కరించింది. ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ఓటింగ్‌పై సైబర్ దాడి ప్రయత్నం జరిగినట్లు రష్యా ఎన్నికల అధికారులు తెలిపారు.