Site icon NTV Telugu

Israeli missile attack on Syria: సిరియాపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.. ముగ్గురు సైనికులు మృతి

Israeli Missile Attack Near Damascus

Israeli Missile Attack Near Damascus

ఇజ్రాయిల్‌ క్షిపణి సిరియాపై బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమిత సిరియాలో గోలన్‌ ప్రాంతం నుంచి బాంబులతో దాడి చేశారని వెల్లడించారు. అయితే కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విఛ్చిణ్ణం చేశారని పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో.. ఇంటెలిజెన్స్‌ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా ఈబాంబు దాడి జరిగిందని సీరియస్‌ హ్యూమన్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ తెలిపింది. మెజ్జామ్‌ మిలిటరీ ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలోని ఓ కార్‌ పై కూడా మిసైల్‌ పండిందని ప్రకటించారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో పదిపమంది తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించారు.

Manoj Bajpayee: ‘ఎక్కడ్నుంచి పట్టుకొస్తార్రా’ అంటూ ‘పుష్ప-2’పై బాంబ్

Exit mobile version