Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ‘‘ట్రంప్ను వదిలిపెట్టేది లేదు’’ అని వార్నింగ్ ఇచ్చింది. తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపినందుకు అమెరికా అధ్యక్షుడు ‘‘మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడుల్లో ఖమేనీ మరణించారు. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైంది.
Read Also: Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్కు నిరాశ!
‘‘మా నాయకుడు, మా ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుంటాము. ట్రంప్ మూల్యం చెల్లించాలి.’’ అని ఖమేనీ అత్యంత సన్నిహిత సహాయకుడు లారిజాని ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదే కాకుండా, ఇరాన్ పొరగు దేశాలు అమెరికాకు సాయం చేయొద్దని, వారి భూభాగాలను అమెరికా ఉపయోగించకుండా నిరోధించాలి లేదా దానిని మనమే చేయడం తప్ప వేరే మార్గం లేదు అని అన్నారు. శత్రువులు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుంచి దాడులు చేస్తే మేము తీవ్రంగా స్పందిస్తామని లారిజానీ స్పష్టం చేశారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్ లారిజాని ప్రస్తుతం, ఇరాన్లో నిర్ణయాలు తీసుకునే కీలక వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. అమెరికా, ఇరాన్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వెనిజులాలో చేసినట్లు ఇరాన్లో చేయడానికి ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.
