Site icon NTV Telugu

Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి..

Israel Iran War

Israel Iran War

Israel-Iran War: మధ్యప్రాచ్యం అతలాకుతలం అవుతోంది. ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. శనివారం మొదలైన దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. టాప్ ఇరాన్ అధికారులు మరణించారు.

Read Also: Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!

యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్‌లో మరణించిన వారి సంఖ్య 787కు చేరిందని ఇరాన్ రెడ్ క్రిసెంట్‌ను ఉటంకిస్తూ ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ అమెరికా – ఇజ్రాయిల్ దాడుల్లో మృతుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌లపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్‌లో పెద్ద నగరాలైన దోహా, అబుదాబి, దుబాయ్‌, షార్జాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ నిఘా అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన సభ్యులు చనిపోయినట్లు తెలిపింది.

Exit mobile version