Site icon NTV Telugu

UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాస‌లో భారత్ ఖండన

Unindia

Unindia

హార్ముజ్ జలసంధి దగ్గర వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏ మాత్రం భావ్యం కాదని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో హార్ముజ్‌పై భారతదేశం బలమైన సందేశం ఇచ్చింది. హార్ము్జ్ జలసంధిని దిగ్బంధించడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇది కూడా చదవండి: Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్

‘‘వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, నిరపరాధ సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టడం, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా వాణిజ్యాన్ని అడ్డుకోవడం అసహ్యం’’ అని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గౌరవించాలని కోరింది. హార్ముజ్ దగ్గర భారతీయ నావికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. హార్ముజ్‌లో సురక్షిత నౌకాయానాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం కోసం యూకేలో జరిగిన 60కి పైగా దేశాల సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు అవసరమని అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: MK Stalin on Delimitation Bill: కేంద్రంపై స్టాలిన్‌ ఫైర్‌.. మొండిగా ముందుకెళ్తే తమిళనాడు వీధుల్లో నిరసన జ్వాలలు..!

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి.

 

Exit mobile version