Hindus In Bangladesh: దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వండి.. హిందూ టెంపుల్స్ కి బెదిరింపులు..!
- బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాల్లో విగ్రహాలు ధ్వసం..
- దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపు..
- యూనస్ సర్కార్ కు ఫిర్యాదు చేసిన హిందూ సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindus In Bangladesh: బంగ్లాదేశ్లో మళ్లీ హిందూ సమాజమే లక్ష్యంగా బెదిరింపులకు దిగుతున్నారు. దుర్గుపూజ చేసుకునేందుకు 5 లక్షల బంగ్లాదేశ్ టాకా ఇవ్వాలని ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు దేవాలయాలు, కమిటీలకు బెదిరింపు లేఖలు పంపినట్లు సమాచారం. ఆ మొత్తం చెల్లించకుంటే పూజకు అనుమతించబోమని చెప్పారు. అలాగే, దుర్గామాత విగ్రహాన్ని పగలగొడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: ED Raids : చైనా 400 కోట్ల గేమింగ్ యాప్ కుట్ర బట్టబయలు చేసిన ఈడీ ..రూ.25కోట్లు స్వాధీనం
Also Read
- Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
కాగా, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు దుర్గాపూజ చేయడానికి దేవాలయాల నుంచి 5 లక్షల రూపాయలను డిమాండ్ చేశాయని హిందూ సంఘాలు తెలిపాయి. అలాగే, ఖుల్నా జిల్లాలోని డాకోప్లో ని హిందూ సంఘాలకు చెందిన పూజా కమిటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి లేఖలు వచ్చాయి. చెప్పిన మొత్తాన్ని చెల్లించకుంటే.. దుర్గాపూజకు అనుమతించేది లేదని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న లక్ష్మీగంజ్ జిల్లాలోని రాయ్పూర్ ప్రాంతంలో కొందరు మదర్సా కుర్రాళ్లు దుర్గా విగ్రహాలను పగలగొట్టారు. దీంతో పాటు బార్గునా జిల్లాలోని ఒక ఆలయంలో గల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు హిందూ సంఘాలు వెల్లడించాయి. ఇక, బంగ్లాదేశ్ లో అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుర్గాపూజ జరుపుకుంటారు. విశేషం ఏమిటంటే ఇది బంగ్లాదేశ్ హిందువులకు అతి పెద్ద పండుగ.
Read Also: Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలి..
అలాగే, ఇటీవల చిట్టగాంగ్, ఖుల్నా జిల్లాల అధికారులకు హిందూ సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కమిటీ కూడా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కమిటీ 6 మంది సభ్యులతో కూడిన సెల్ను కూడా ఏర్పాటు అయింది. ఇది మైనారిటీ వర్గాల ప్రజల యొక్క భద్రతను చూసుకుంటుంది. ఇక, చిట్టగాంగ్ జిల్లాకు చెందిన సనాతన్ విద్యార్థి సంసద్ అధ్యక్షుడు కుశాల్ చక్రవర్తి ఛానెల్తో మాట్లాడుతూ.. మా మనసుల్లో భయం ఉంది.. మా భద్రత కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం.. ఫరీద్పూర్, ఖుల్నాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి.. మేము దుర్గాపూజ కోసం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!