NTV Telugu Site icon

తప్పిన చైనా ముప్పు… 

చైనా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది.  ఇందులో భాగంగానే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన విడిభాగాలను తీసుకొని లాంగ్ మార్చ్ 5 బీ  అనే ఇటీవలే ఆకాశంలోకి దూసుకుపోయింది.  అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది.  అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది.  భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు.  ఈరోజు ఉదయం ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయింది.  దాని శకలాలు జనావాసాలపై కాకుండా హిందూ మహా సముద్రంలో పడిపోయాయి.  దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.