Site icon NTV Telugu

బంగ్లాదేశ్ లో పడవ మునక…25 మంది మృతి 

బంగ్లాదేశ్ లో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది.  బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు.   ఇసుక రవాణా అధికంగా ఈ నది గుండా జరుగుతుంది.  అయితే,  పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో  ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది.  ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు.  ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు.  అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.  పద్మ నదిలో జరిగిన ప్రమాదం పట్ల అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.  

Exit mobile version