Alcor Life Extension: చనిపోయిన వారిని మళ్లీ బతికించే సంస్థ.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
alcor life extension foundation preserve dead bodies in the hope of reincarnation: మృతి చెందిన వారు మళ్లీ తిరిగిరారన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే, అంతిమ సంస్కారాలు చేసి, అక్కడితో వదిలేస్తాం. కానీ.. కొందరు మాత్రం చనిపోయిన తమ కుటుంబీకులు తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఒక సంస్థ చనిపోయిన వారి శరీరాలను భద్రపరుస్తోంది. మృతి చెందిన వారు బతికి రావడం అసాధ్యమైనా, దాన్ని సాధ్యం చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ పేరు అల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్. ఇది అమెరికాలో ఉంది. చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారో, వారి మృతదేహాల్ని ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తారు.
ఈ ఫౌండేషన్ను 1972లో లిండా, ఫ్రెడ్చాంబర్ లైన్ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా వాళ్లు చెప్తున్నారు. చనిపోయిన వారిని లిక్విడ్ నైట్రోజన్తో నిండిన ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో ఉంచుతారు. దీనిని క్రయో ప్రిజర్వ్ అంటారు. ఇందులో మృతదేహాలను మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు ఉంచుతారు. 2014లో మృతిచెందిన బిట్కాయిన్ మార్గదర్శకుడు హాల్ ఫిన్నీ శరీరాన్ని క్రయో ప్రిజర్వ్ చేశారు. అలాగే.. 2015లో బ్రెయిన్ క్యాన్సర్తో మృతిచెందిన థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్పాంగ్ను ఉంచారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తమ పాపని కాపాడుకునేందుకు మెదడుకు ఎన్నో శస్త్రచికిత్సలు చేశారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, తమ పాపా ఏనాడైనా బతికొస్తుందన్న నమ్మకంతో.. ఈ ఫౌండేషన్ని సంప్రదించి, ఆ పాప మృతదేహాన్ని క్రయో ప్రెజర్వ్ చేశారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
ఇందులో మృతదేహాలను రక్షించేందుకు అల్కోర్ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో వాళ్లు మొదటగా శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాల్ని తొలగించి.. హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద ట్యాంకుల్లో ఉంచుతారు. ఇలా మృతదేహాల్ని భద్రపరుస్తున్నందుకు గాను వాళ్లు సుమారు రూ. 1 కోటి వరకు ఛార్జ్ చేస్తారు. ఇందులో ఇప్పటివరకూ 199 మంది మానవులను, 100 పెంపుడు జంతువుల్ని క్రయో ప్రిజర్స్ చేశారు. మరో 500 మంది తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్ చేయడానికి తమ సంస్థను సంప్రదించినట్టు ఫౌండేషన్ అధికారులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!