Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malacca Strait: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం కాస్తా.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.. మధ్యప్రాచ్యంలో హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతల ప్రభావం ఇంకా కొనసాగుతుండగానే, ఇప్పుడు ఆసియాలోని కీలక సముద్ర మార్గమైన మలక్కా జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండోనేషియా ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం రేపాయి. మలక్కా జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మంత్రి వ్యాఖ్యలతో కలకలం
ఇండోనేషియా ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సాదేవ్ ఇటీవల మాట్లాడుతూ, తమ నియంత్రణలో ఉన్న మలక్కా జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధిస్తే దేశానికి భారీ ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో, ఇరాన్ హార్మూజ్ జలసంధిలో అనుసరిస్తున్న విధానాన్ని ఇండోనేషియా కూడా అనుసరిస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు రావడంతో ఇండోనేషియా ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇచ్చింది. మలక్కా జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి రవాణా రుసుములు లేదా టోల్ విధించే ప్రణాళికలు లేవని మంత్రి ప్రకటించారు. తమ దేశం ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS)కు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
హార్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం
ఇటీవల హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లోనే మరో కీలక సముద్ర మార్గమైన మలక్కా జలసంధి గురించిన చర్చలు మొదలవడంతో ప్రపంచ వాణిజ్య రంగం అప్రమత్తమైంది.
మలక్కా జలసంధి ఎందుకు కీలకం?
మలక్కా జలసంధి దాదాపు 900 కిలోమీటర్ల పొడవు కలిగిన సముద్ర మార్గం. ఇది తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య అతి తక్కువ దూరం కలిగిన సముద్ర రవాణా మార్గంగా భావిస్తారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, సింగపూర్ దేశాల మధ్య ఈ జలసంధి ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కూడా ఇది అత్యంత కీలక మార్గం. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రవాణా అవరోధ బిందువుగా పేర్కొంది.
భారీగా పెరిగిన నౌకా రాకపోకలు
మలేషియా సముద్రయాన శాఖ గణాంకాల ప్రకారం, 2025లో మలక్కా జలసంధి గుండా 1,02,500కు పైగా నౌకలు ప్రయాణించాయి. 2024లో ఈ సంఖ్య 94,300 మాత్రమే ఉండగా, ఏడాదిలోనే గణనీయంగా పెరిగింది. అయితే, హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి కూడా సమస్యాత్మకంగా మారితే ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇండోనేషియా వివరణ ఇచ్చినా, ఈ అంశంపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!