Site icon NTV Telugu

Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు షాక్‌… సరికొత్త ప్లాన్‌తో జర్మనీ

Germany

Germany

Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు పెద్ద షాక్‌ తగలనుంది. చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు జర్మనీ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘స్ట్రాటజీ ఆన్‌ చైనా’ పేరిట 40 పేజీల వ్యూహపత్రాన్ని గురువారం విడుదల చేసింది. దీనిలో బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు బెర్లిన్‌ అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వెల్లడించింది.

Read also: Neha Malik Pics: పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న నేహా మాలిక్.. హాట్ పిక్స్ వైరల్!

‘‘చైనా మారిపోయింది. ఆ దేశ రాజకీయ నిర్ణయాలు, మార్పుల కారణంగా మేము కూడా చైనా విషయంలో అనుసరించే వైఖరిని మార్చుకోవాల్సి ఉంది’’ అని ఆ వ్యూహపత్రంలో జర్మనీ పేర్కొంది. తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా తీవ్రంగా పనిచేస్తోందని.. ఇందు కోసం అంతర్జాతీయ నిబంధనలు కూడా మార్చేందుకు ప్రయత్నించడం ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారిందని ఆ పత్రంలో పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొన్ని రోజులపాటు మల్లగుల్లాలు పడి చివరికి దీనికి ఆమోద ముద్రవేసింది. చైనాలో వ్యాపారం, పెట్టబడులను కొనసాగిస్తూనే.. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా ఔషధాలు, విద్యుత్తు కార్లలో వాడే లిథియం బ్యాటరీలు, చిప్స్‌ తయారీ ముడిసరుకుల విషయంలో దీనిని అమలు చేయనుంది. ఈ వ్యూహ పత్రంపై దేశ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ట్వీట్‌చేశారు. తాము చైనా నుంచి విడిపోవాలనుకోవడంలేదని.. కానీ, కీలక విషయాల్లో ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నామని దేశ ఛాన్సలర్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు పెరిగాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. బెర్లిన్‌కు బీజింగ్‌ అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామి అన్న విషయం తెలిసిందే. 2022లో ఇరుదేశాల మధ్య 300 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.

Exit mobile version