NTV Telugu Site icon

ఒక మహిళ.. ముగ్గురు ప్రియులు.. భారీ స్కెచ్.. చివరికి

murder

murder

ఆమె ఒంటరి మహిళ.. భర్త చనిపోవడంతో బిడ్డలతో కలిసి బతకాల్సింది పోయి తప్పుడు మార్గం ఎంచుకొంది . పడక సుఖం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుతో అఫైర్ పెట్టుకొంది .. ఎవరికి తెలియకుండా కొన్నిరోజులు కామ కార్యకలాపాలు సాగించింది. చివరికి ముగ్గురు ప్రియులలో ఒకరికి తన అఫైర్స్ గురించి తెలియడంతో మరో ఇద్దరు ప్రియులతో కలిసి మూడో ప్రియుడిని అంతమొందించింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కృష్ణాజిల్లా జిల్లా వీరులపాడుకు చెందిన నాగమల్లేశ్వరికి గురజాల మండలం అంబాపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో నాగమల్లేశ్వరి సత్తెనపల్లిలో బంధువుల ఇంటివద్ద ఉంటూ హోటల్లో పనిచేస్తూ నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు లారీ క్లీనర్ చాంద్ బాషా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి వాళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఐతే చాంద్ బాషాతో సహజీవనం చేస్తూనే.. మల్లేశ్వరి మాత్రం మరో ఇద్దరితో ఎఫైర్ నడుపుతోంది. ఈ విషయం చాందర్ భాషాకు తెలియడంతో నిత్యం తాగొచ్చి నాగమల్లేశ్వరిని కొట్టడమే కాకుండా.. ఆమెకున్న వివాహేతర సంబంధాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో అతడితో విసిగిపోయిన ఆమె, ఇద్దరు ప్రియులతో కలిసి అతడిని అంతమొందించాలని ప్లాన్ వేసింది.

అనుకున్నట్లుగానే డిసెంబర్ 2 న అర్ధరాత్రి చాంద్ బాషాకు ఫుల్లుగా మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి ముగ్గురు హత్య చేశారు. ఉదయం స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమల్లేశ్వరిని తమదైన రీతిలో విచారించగా ఆమె నిజం ఒప్పుకొంది. హత్యలో పాల్గొన్న మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.