రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లివస్తున్న ఓ వ్యాన్ బోల్తా కొట్టింది. చందుర్తి మండలం ఎనగంటి గ్రామ శివారులో పెండ్లి వ్యాన్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. హన్మాజీపేటలో పెళ్లికి వెళ్లి అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
దీంతో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరినప్పుడు వ్యాన్ లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడినవారు మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.