Site icon NTV Telugu

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూర్ మండలం గుర్తుర్ గ్రామ శివారులోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నర్సంపేట నుండి తొర్రూర్ కు ఆర్టీసీ బస్సు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కండక్టర్‌ కు తీవ్ర గాయాలయ్యాయి.

అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంలో ఘటనా స్థలానికి ఎస్సై గండ్రాతి సతీష్ చేరకున్నారు. అంతేకాకుండా తీవ్ర రక్తస్రావం అవుతున్న కండక్టర్‌తో పాటు ప్రయాణికులను తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version