Site icon NTV Telugu

30 Crore Users Personal Data Leaked?: 30 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్‌..? ఆ నెట్‌వర్క్‌ వారికి టెన్షన్‌..!

Personal Data Leaked

Personal Data Leaked

30 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్‌ అయినట్టు వస్తున్నవార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… వొడాఫోన్‌ ఐడియా.. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో లోపాన్ని గుర్తించింది, అయినప్పటికీ ఆ సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది.. అయితే, 20 మిలియన్ల వొడాఫోన్‌ ఐడియా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల డేటా లీక్ అయిందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. వీఐ యొక్క బిల్లింగ్ సిస్టమ్‌లో బగ్ స్పష్టంగా ఉంది.. సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ అయిన ‘సైబర్ ఎక్స్9’ చెబుతున్న దాని ప్రకారం వొడాఫోన్ ఐడియాకు చెందిన దాదాపు 301 మిలియన్ (30.1 కోట్లు) కస్టమర్‌ల కాల్ లాగ్‌లతో సహా కస్టమర్ యొక్క సున్నితమైన మరియు గోప్యమైన వ్యక్తిగత డేటాను మొత్తం ఇంటర్నెట్‌కు బహిర్గతం చేసిందని.. ఇందులో 20 మిలియన్ల పోస్ట్‌పెయిడ్ వీఐ కస్టమర్ల డేటా ఉందని చెబుతోంది.

Read Also: Sara Ali Khan and Shubman Gill: యంగ్ క్రికెటర్‌తో సారా అలీఖాన్‌ డేటింగ్‌..! ఇదిగో సాక్ష్యం

ఇక, ఈ వార్తలపై వొడాఫోన్ ఐడియా స్పందించింది. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో లోపం ఉన్నట్టు అంగీకరించింది. కానీ, వెంటనే దానిని సరి చేసినట్టు రకటించింది. అయితే, తాము చేసిన ఫోరెన్సిక్ విశ్లేషణలో డేటా లీక్ అయినట్టు తేలలేదని పేర్కొంది.. సైబర్ ఎక్స్9 చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.. సైబర్‌ ఎక్స్‌ 9 పరిశోధన యొక్క ముఖ్య ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. వొడాఫోన్‌ ఐడియా మిలియన్ల కొద్దీ కస్టమర్ల డేటాను (కాల్ లాగ్‌లు, కాల్ వ్యవధి, కాల్ చేసిన ప్రదేశం మరియు ఫోన్ నంబర్) పూర్తిగా ప్రమాదంలో ఉంచింది.. వారి జీవిత గోప్యతను “పాడు” చేసింది. బ్లాగ్ కంపెనీని “కస్టమర్ డేటా భద్రత పట్ల” అజాగ్రత్తగా ఉందని పేర్కొంది. ఈ డేటాను చోరీ చేయడం చాలా సులభమని చెబుతోంది.. గత రెండు సంవత్సరాలుగా సైబర్ దాడులకు సంబంధించిన ప్రధాన ఘటనల్లో వీఐ డేటా ఒకటిగా ఆ నివేదిక హైలైట్ చేస్తుంది. గత రెండు సంవత్సరాల్లో వీఐ వినియోగదారుల డేటా ఉల్లంఘించబడిందని ఇది సూచిస్తుంది.

Exit mobile version