Site icon NTV Telugu

Odisha: ఎమ్మెల్యేను చంపుతానని బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

Odisha

Odisha

Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో శాసనసభ్యుడు నిత్యానంద సాహూను చంపుతానని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాలాసోర్ జిల్లాలోని బస్తా ఎమ్మెల్యే సాహూకు మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని నంబర్ నుంచి తన మొబైల్ ఫోన్‌కు కాల్ వచ్చింది.

Nityananda Olakadu: రోడ్ల దుస్థితిపై నిరసన.. నిత్యానంద పొర్లు దండాలు..!

ఈ నేపథ్యంలో బాలాసోర్ పోలీసుల సైబర్ సెల్ దర్యాప్తు ప్రారంభించింది. ముజామిల్‌ అనే వ్యక్తిని మంగళ్‌పూర్ ప్రాంతం నుంచి అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అతడిపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో అనుమానితుడు ముజామిల్ నిందితుడిగా తేలినట్లు, గతంలో మరో ఎమ్మెల్యేతో కలిసి ఇదే తరహాలో గొడవ చేశాడని తేలింది.ఎస్‌కే.ముజామిల్ శాసనసభ్యుల ఫోన్ నంబర్, చిత్రాలను ఇంటర్నెట్ ద్వారా యాదృచ్ఛికంగా డౌన్‌లోడ్ చేసేవాడని, డబ్బు సంపాదించడానికి ఇలాంటి బెదిరింపు కాల్‌లు చేసేవాడని పోలీసు సూపరింటెండెంట్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు.

Exit mobile version