NTV Telugu Site icon

Lover Stabbed GirlFriend: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో.. కక్షతో 20 సార్లు పొడిచి దారుణంగా..

Lover Stabbed Girlfriend

Lover Stabbed Girlfriend

Lover Stabbed GirlFriend: అప్పటి వరకు ఆమె అతడితో తిరిగింది.. అన్నీ పంచుకుంది.. అంతలోనే దూరం పెట్టింది.. వేరొకరి చేత తాళి కట్టించుకుంది.. నాకు దక్కంది మరొకరికి దక్కకూడదన్న కక్షతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు ప్రేమించిన ప్రియుడు. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో చోటు చేసుకుంది.

తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు కక్షగట్టి.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సౌమ్య(23) ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. విషం తాగిన నిందితుడు సుబ్రమణ్య.. దేవనహళ్లిలోని ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Lucknow Wall Collapse: శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని ఫోన్ కాల్ రక్షించింది..

అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం సౌమ్య హఠాత్తుగా పనిమానేసింది. రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సౌమ్య తనను మోసం చేసిందని పగతో రగిలిపోయిన సుబ్యమణ్య సమయం కోసం వేచి చూసాడు. ఇలా ఉండగా బుధవారం సౌమ్య అవటికి వచ్చింది. అదే రోజు రాత్రి సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సుబ్యమణ్య ఇంట్లో జొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గురువారం రాత్రి సౌమ్య ఇంటికి వెళ్లి కత్తితో 20 సార్లు పొడిచాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.