Hyderabad Child Kidnap: మీ పిల్లలు జాగ్రత్త..!
- చందానగర్లో 4 ఏళ్ల బాలుడు అదృశ్యం
- బాలుని జాడ కనిపెట్టేందుకు టీమ్స్ ఏర్పాటు
- సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Child Kidnap: పిల్లల విషయంలో ఏమరపాటు వద్దు. కన్ను మరల్చామా అంతే.. గద్దలు తన్నుకు పోయినట్లు పిల్లలను ఎగేసుకుని పోతారు. పిల్లలు లేని దంపతులు సంప్రదిస్తే వారికి అమ్మేసుకుంటారు. అలా.. పిల్లలను దొంగిలించి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్లోని చందానగర్లో ఓ 4 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు పిల్లలను ఎత్తుకు వెళ్తున్న ముఠా గురించి విషయాలు తెలిశాయి…
READ ALSO: Durvas Patil : రత్నగిరి దారుణం.. ప్రేమికురాలి మృతదేహం లోయలో!
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
హైదరాబాద్లోని పోచమ్మ టెంపుల్ వద్ద ఆగస్టు 26న అఖిల్ అనే 4 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అ బాలుని తల్లి.. మరో కొడుకును ఆస్పత్రికి తీసుకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. వచ్చి చూసే సరికి అఖిల్ అదృశ్యమయ్యాడు. చుట్టు పక్కల అంతా వెతికింది. కానీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు..బాలుని జాడ కనిపెట్టేందుకు టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు..
ఈ కేసులో ప్రధాన నిందితునిగా చిలుకూరి రాజును గుర్తించారు. అతను ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహరెడ్డి సహకరిస్తున్నారు. వీరందరూ ఓ ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని తల్లిదండ్రులకు వారిని అమ్ముకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో రెక్కీ చేస్తారు. ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తిస్తారు. మఖ్యంగా సంచార జాతుల వారి పిల్లలను కిడ్నాప్ చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. వారు ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోరనేది ముఠా సభ్యుల అభిప్రాయం. అలా మొత్తంగా ఇప్పటి వరకు గత ఐదేళ్లలో ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి.. అమ్మేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది..
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఆమెను కస్టడీలోకి తీసుకుంటే ఎంత మంది పిల్లలను అమ్మేశారనే విషయం బయటపడుతుందని చెబుతున్నారు. ఇక ఈ ముఠాతోపాటు బాల్ రాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్ రాజు తన ఇద్దరు పిల్లలను ఈ ముఠాకు అమ్మినట్లు గుర్తించారు. మొత్తంగా నలుగురు పిల్లలను రెస్క్యూ చేసి పేరెంట్స్ కు అప్పగించారు. ఇక వీరి దగ్గర నుంచి పిల్లలను కొన్న పేరెంట్స్ పైనా కేసులు పెడుతున్నారు పోలీసులు.. మరోవైపు తన కొడుకు తనకు దొరుకుతాడనుకోలేదని అఖిల్ తల్లి చెబుతోంది. తన కొడుకును వెతికి తీసుకు వచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. పిల్లలను అమ్ముతున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.. ఎంత పనిలో ఉన్నా చిన్న పిల్లలపై ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇలాంటి ముఠాల బారిన పిల్లలు పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!