Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు

  • నోట్ల కట్టలు చూసి షాకైన పోలీసులు
  • దాదాపు నాలుగు కౌంటింగ్ మిషన్లు తెప్పించిన సిబ్బంది
  • 6.076 కేజీల గంజా, 577 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
Untitled Design (1)

Untitled Design (1)

యూపీలోని ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్లలు దొరికాయి. దీంతో ఆ నోట్ల కట్టలను లెక్కపెట్టలేక పోలీసులే అలసిపోయారు. అయితే అక్కడ ఉన్న నోట్ల కట్లలు చూసి వారు షాకయ్యారు. నోట్ల కట్లలు లెక్కపెట్టలేక అలసిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాపనగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. అతని భార్య రీనా మిశ్రా ఆధ్వర్యంతో.. కుటుంబ సభ్యుల సాయంతో నెట్ వర్క్ నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతాపగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడ ఉన్న నోట్ల కట్లలు చూసి వారు షాకయ్యారు. నోట్ల కట్లలు లెక్కపెట్టలేక అలసిపోయారు. ప్రస్తుతం అతను జైలులో ఉండగా.. అతని భార్య రీనా మిశ్రా గ్యాంగ్ నాయకురాలిగా మారి కుటుంబ సహాయంతో నెట్ వర్క్ నడుపుతుంది. ఇందుకు కొడుకు వినాయక్(19), కూతురు కోమలి(20), మేనల్లుళ్లు యశ్(19), అజిత్(31) సహకరిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Read Also: Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా…

ఈ క్రమంలో అక్కడ భారీ మొత్తంలో నోట్ల కట్టలు గుర్తించారు. 100, 50, 20 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిన లెక్కపెట్టేందుకు ప్రయత్నించిన పోలీసులకు చుక్కలు కనిపించాయి. వారు నోట్లు లెక్కపెట్టలేక దాదాపు నాలుగు కౌంటింగ్ మిషన్లు తెప్పించారు. దాదాపు 6.076 కేజీల గంజా, 577 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలు సుమారు కోటి రూపాయలు ఉండగా.. లెక్కించిన డబ్బు రెండు కోట్ల రెండు లక్షలని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.