బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన భర్తను తన భార్యను హత్యచేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే…ధర్మశీలం అనే వ్యక్తి దుబాయ్ లో మేస్త్రీ పని చేస్తున్నాడు. అతడి భార్య మంజు బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ జంట సెప్టెంబర్ 2022లో వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆ మహిళ తన తండ్రి పెరియ స్వామితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి మంజును కత్తితో దాడి చేసి హత్య చేశాడు భర్త ధర్మశీలం.. అనంతరం నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
