NTV Telugu Site icon

Andrapradesh : ఆ వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య..

Ap (2)

Ap (2)

భార్యా భర్తల బంధం అనేది ఒకప్పుడు పవిత్రంగా ఉండేది.. ప్రేమలు, చిలిపి పనులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం కోపాలు, కక్ష్యలు.. భార్య నచ్చని పని చేసిందని భర్త .. భర్త చేసాడని భార్య.. ఇలా చివరికి హత్యలు జరిగేలా ప్రేరేపిస్తున్నాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ మహిళ తన భర్త మార్మాంగాన్నే కోసేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. నందిగామా మండలంలో చోటు చేసుకుంది.. తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. నందిగామ లోని అయ్యప్ప నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉంటున్నారు.. సాఫీగా సాగిపోతున్న వీరి బంధంలోకి రీల్స్ వచ్చాయి..

అయితే గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం వీడియోలు చూస్తుండగా.. వరమ్మకు తీవ్ర కోపం వచ్చింది. తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబు పై మండిపడింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ మాటలు కొట్టుకొనే వరకు వెళ్లింది.. ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఆ తర్వాత వరమ్మకు కోపం ఎక్కువైంది.. దాంతో భర్త పై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను వరమ్మ కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనంద్ బాబును కుటుంబ సభ్యులు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..