Site icon NTV Telugu

సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదు

న‌టి క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదైంది. జ‌గ‌ద్గిరిగుట్ట పీఎస్ లో క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదు అయింది. గ‌తంలో సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో ఓ బాలిక పై జ‌రిగిన హ‌త్యాచార వివ‌రాల‌ను క‌రాటే క‌ళ్యాణి.. త‌న సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. అయితే.. ఈ సంఘ‌ట‌న పై రంగారెడ్డి జిల్లా జ‌గ‌ద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు.

https://ntvtelugu.com/special-story-on-telangana-bjp-party/

దీంతో క‌రాటే క‌ళ్యాణి పై… కోర్టు ఆదేశాల‌తో జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా.. సింగ‌రేణి కాల‌నీలో బాలిపై హ‌త్యాచారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌నలు కూడా వ్య‌క్తం అయ్యాయి. అయితే.. ఈ కేసులో నిందితుడు రైలు కింద ప‌డి మ‌ర‌ణించాడు.

Exit mobile version