Site icon NTV Telugu

US Tariffs: పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్! టారిఫ్ అంశంలో సీన్ రివర్స్.. భారత్‌కు లాభం, పాక్‌కు నష్టం

Us India Trade Deal1

Us India Trade Deal1

US Tariffs: పాకిస్థాన్‌కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు! తాజాగా భారత్‌–అమెరికా మధ్య మరో కీలకమైన వాణిజ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా ఒప్పందం ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్ను 50 శాతం నుంచి నేరుగా 18 శాతానికి తగ్గనుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఎలా షాక్ అవుతందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే.. ఈ మధ్య పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ ఎంత సానిహిత్యంగా మెరిగారో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఓ వైపు… ట్రంప్ చాలా గ్రేట్ అని షరీఫ్, మునీర్ కొనియడుతుంటే.. మరోవైపు.. మునీర్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ట్రంప్ చెప్పారు. కానీ.. టారిఫ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ పాకిస్థాన్‌పై అమెరిక 19 శాతం టారిఫ్‌ను విధించింది. భారత్‌పై మాత్రం ఒక శాతం తక్కువ అంటే 18 శాతం సుకం విధించింది. భారత్‌ కంటే పాకిస్థాన్‌పై టారిఫ్ ఒక శాతం ఎక్కువగా ఉంది. ఇదే పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన షాకింగ్‌గా చెబుతున్నారు.

READ MORE: Vishwambhara : విశ్వంభర టీజర్‌పై విమర్శలు.. యూవీ క్రియేషన్స్ షాకింగ్ డెసిషన్!

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ టారిఫ్ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో ప్రకటించారు. భారత్ ఇకపై అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, అవసరమైతే వెనిజువెలా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను 18 శాతానికి తగ్గడం చాలా సంతోషకరం. ఈ గొప్ప నిర్ణయానికి భారత ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు,” అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోడీ పేర్కొన్నారు.

READ MORE: US India Trade Deal: ట్రక్‌లోకి ట్రంప్-మోడీ దోస్తాన్.. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌పై తక్కువ సుంకాలు..

ఈ ఒప్పందంతో ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో నిలిచింది. చైనా, పాకిస్థాన్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాల కంటే భారత్‌పై అమెరికా విధించే పన్ను తక్కువగా ఉంటుంది. అయితే యూరోప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రదేశాలతో పోలిస్తే మాత్రం భారత్‌పై పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అమెరికా బ్రెజిల్‌పై 50 శాతం పన్ను విధిస్తోంది. మయన్మార్, లావోస్‌లపై 40 శాతం, చైనాపై 37 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం పన్ను ఉంది. దక్షిణాసియాలో వియత్నాం, బంగ్లాదేశ్‌లపై 20 శాతం, పాకిస్థాన్, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్‌లపై సుమారు 19 శాతం పన్ను ఉంది. మరోవైపు బ్రిటన్‌పై కేవలం 10 శాతం మాత్రమే. యూరోప్ యూనియన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలపై 15 శాతం పన్ను ఉంది.

Exit mobile version