Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి గొంతులో ‘మంట’ పుడుతోంది. దీనికి ప్రధాన కారణం భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు. గత కొద్ది రోజులుగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించడం యజమానులకు కత్తిమీద సాములా మారింది. ముడి సరుకుల ధరలు, లేబర్ ఖర్చులకు తోడు గ్యాస్ భారం తోడవడంతో, ఆ భారాన్ని హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల మీదకు మళ్లించాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
హోటల్ మెనూలో మంట..
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లోని హోటళ్లలో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు రూ. 30 నుంచి రూ. 40 మధ్యలో లభించే ఇడ్లీ ప్లేట్ ఇప్పుడు ఏకంగా రూ. 75 కి చేరింది. ఇక దోశ విషయానికి వస్తే.. నెయ్యి లేదా మసాలా దోశ ధరలు రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
సాధారణ మధ్యతరగతి హోటళ్లలో కూడా ఫుల్ మీల్స్ ధర రూ. 200 కి చేరింది. టీ & కాఫీ విషయానికి వస్తే.. సామాన్యుడికి అందుబాటులో ఉండే టీ ధర కూడా రూ. 15 నుంచి రూ. 20 వరకు పెరిగింది.
ధరల పెరుగుదలకు కారణాలు..
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల హోటల్ నిర్వహణ వ్యయం 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగింది. పప్పు దినుసులు, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడం హోటల్ యజమానులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కరెంటు బిల్లులు, షాపుల అద్దెలు , పనివారి జీతాలు పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అని యజమానులు వాదిస్తున్నారు.
ధరల పెరుగుదలపై కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇంత రేట్లు పెట్టి మేం టిఫిన్స్, భోజనాలు హోటల్స్లో తినలేం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేయాలన్నా వెయ్యి రూపాయలు సరిపోని పరిస్థితి ఉంది. చాలా మంది బ్యాచిలర్స్, విద్యార్థులు మెస్ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా.. కొన్ని హాస్టల్స్ వచ్చే నెల నుంచి రెంట్స్ కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతోంది, ఇది ఇలాగే కొనసాగితే పేద ప్రజల ఆకలి తీరడం కష్టంగా మారనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!