Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: ఢిల్లీ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న ఒక చిన్న దేశం, మన దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. ఆ దేశం మరేదో కాదు తైవాన్. బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం.. తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 411 లక్షల కోట్లు) చేరుకుంది. దీంతో భారత్ మార్కెట్ విలువ అయిన 4.92 ట్రిలియన్ డాలర్లను తైవాన్ అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచ ఈక్విటీ మార్కెట్ రేంకింగ్స్లో అమెరికా, చైనా, జపాన్, హాంగ్కాంగ్ ల తర్వాత తైవాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామం ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే భారత్లో లిస్ట్ అయిన కంపెనీల సంఖ్య ఎక్కువ, ఆర్థిక వ్యవస్థ పరంగా తైవాన్ కంటే భారత్ చాలా పెద్దది, పైగా 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల బేస్ సైతం భారత్ సొంతం. మరోవైపు తైవాన్ జనాభా కేవలం 2.3 కోట్లు మాత్రమే. అయినప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి బిలియన్ల కొద్దీ నిధులను వెనక్కి తీసుకుంటూ, తైవాన్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క కారణం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI).
తైవాన్ మార్కెట్ ఈ స్థాయికి చేరడం వెనుక ఆ దేశానికి చెందిన చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ (TSMC) కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ అయిన TSMC, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ (AI) విప్లవం వల్ల విపరీతంగా లాభపడింది. తైవాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో ఈ ఒక్క కంపెనీ వాటాయే దాదాపు 42 శాతంగా ఉందంటే దీని హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ చిప్లకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఈ కంపెనీ షేర్లు 49 శాతం లాభపడ్డాయి. ఎన్విడియా, యాపిల్, ఏఎమ్డి, క్వాల్కమ్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు అవసరమైన అడ్వాన్స్డ్ చిప్లను ఈ కంపెనీయే తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా ఏఐ, సెమీకండక్టర్ రంగాలు వైపు పరుగులు తీస్తుండటంతో తైవాన్, దక్షిణ కొరియా లాంటి తయారీ హబ్లకు భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ఇక, తైవాన్ దూసుకుపోతుంటే, భారత్ మాత్రం భిన్నమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, కంపెనీల త్రైమాసిక లాభాల వృద్ధి మందగించడం, విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం షేర్లను విక్రయించడం వంటి సమస్యలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, అంతర్జాతీయంగా నడుస్తున్న ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంతో నేరుగా ముడిపడి ఉన్న పెద్ద కంపెనీలు భారత స్టాక్ మార్కెట్లలో లేవు. తైవాన్ తరహాలో ప్రపంచాన్ని శాసించే సెమీకండక్టర్ లేదా ఏఐ హార్డ్వేర్ కంపెనీలు మన దేశంలో ఇంకా లిస్ట్ కాలేదు.
Also Read
- Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. మినిమమ్ డ్యూ చెల్లిస్తే భారీ నష్టం.. కొత్త రూల్స్ తెలుసుకోండి
- Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
- SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
- Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
తాజావార్తలు
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!