Site icon NTV Telugu

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. నిన్నటి పరంపర ఈరోజు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో మార్కెట్ కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలపై నెలకొన్న అనిశ్చితి.. చమురు ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి నష్టాల్లో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 457 పాయింట్లు నష్టపోయి 78, 056 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 24, 269 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ట్రెంట్, టెక్ మహీంద్రా, ఎం&ఎం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్ అగ్ర నష్టాల్లో ఉండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్, సిప్లా, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

Exit mobile version