Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Price Hike: దేశంలో బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే విలువైన లోహం ‘వెండి’. తాజాగా కేంద్ర ప్రభుత్వం వెండి ప్రియులకు గట్టి షాక్ ఇచ్చింది. వెండి ఆభరణాలు, నాణేలు లేదా పాత్రలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న సామాన్యులపై రాబోయే రోజుల్లో భారీ భారం పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో వెండి దిగుమతి నిబంధనలను ప్రభుత్వం అత్యంత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు ‘స్వేచ్ఛా’ జాబితాలో ఉన్న వెండి దిగుమతులను తక్షణమే ‘నియంత్రిత’ (Restricted) జాబితాలోకి మారుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, పొడి రూపంలో ఉన్న వెండి లేదా పాక్షికంగా తయారైన వెండిని దిగుమతి చేసుకోవాలంటే ఇకపై ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తు లైసెన్స్ లేదా అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లో వెండి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపి, వాటి ధరలు విపరీతంగా పెరిగేందుకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
ఈ కఠిన నిర్ణయం కేంద్రం ఎందుకు తీసుకుందంటే…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత విదేశీ మారక నిల్వలపై భారం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు ఏకంగా రెండున్నర రెట్లు పెరిగి 12.1 బిలియన్ డాలర్లకు చేరడం, డాలర్ సరఫరాపై ఒత్తిడి పెంచింది. దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లడాన్ని తగ్గించేందుకు, వాణిజ్య లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఈ వ్యూహాత్మక చర్య తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని (Import Duty) 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఏడాది పాటు దేశ ప్రజలెవ్వరూ బంగారం కొనుగోలు చేయవద్దని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి భారతదేశానికి స్వంతంగా వెండి ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా తక్కువ, దీంతో ప్రజల అవసరాల కోసం సుమారుగా 80 శాతానికి పైగా విదేశీ దిగుమతులపైనే ఇండియా ఆధారపడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ కొత్త ఆంక్షల వల్ల మార్కెట్లోకి వెండి రాక తగ్గి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే వేగంగా దూసుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. కేంద్రం నిర్ణయంతో సిల్వర్ సఫ్లై చైన్ దెబ్బతింటుందనే భయంతో వ్యాపారవేత్తలు వెండిని పెద్ద ఎత్తున నిల్వ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల వెండి డిమాండ్ పెరిగి, చివరకు ఆ అదనపు భారం అంతా సామాన్య వినియోగదారుడి జేబుకే చిల్లు పెట్టనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!