NTV Telugu Site icon

Stock market: మరోసారి రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతేకాకుండా సెన్సెక్స్ 1,500 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారిగా 83 వేల మార్కు దాటింది. అలాగే నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిని తాకి 25, 400 మార్కును క్రాస్ చేసింది. మొత్తానికి పెట్టుబడిదారుల పంట పడింది. సెన్సెక్స్ 1,439 పాయింట్లు లాభపడి 82, 962 దగ్గర ముగియగా.. నిఫ్టీ 470 పాయింట్లు లాభపడి 25, 388 దగ్గర ముగిసింది. ఆటో, మెటల్, ఎనర్జీ మెజారిటీ స్టాక్‌లు లాభాల్లో దూసుకెళ్లగా.. అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి.