NSC Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSC Scheme: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది తెలిసినప్పుడే ఆ సంపాదన ఆదా అవుతుంది. మీ సంపాదనకు పూర్తి భద్రత, కచ్చితమైన రాబడిని అందించే పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, భవిష్యత్తు కోసం సురక్షితమైన నిధిని నిర్మించాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం నమ్మదగినది మాత్రమే కాకుండా, పన్నులను ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
READ ALSO: Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ
Also Read
- Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
- NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం అనేది భారత ప్రభుత్వం మద్దతుతో పోస్ట్ ఆఫీస్ అందించే ఒక ప్రసిద్ధ చిన్న పొదుపు పథకం. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రభావితం కావు, అలాగే ముందుగా నిర్ణయించిన రాబడిని పొదుపు చేసిన వారికి అందిస్తాయి. అందుకే ఈ పథకం మధ్యతరగతి, పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసేవారికి చాలా ఉపయోగపడేదిగా చెబుతున్నారు. ఈ పథకాన్ని కనీసం ₹1,000తో ప్రారంభించవచ్చు, దీంట్లో గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. అలాగే ఈ పథకంలో 5 సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం NSC పై 7.7% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల తర్వాత సుమారు రూ.14.49 లక్షలు పొందుతాడు. అంటే ఇందులో పొదుపు చేసిన వారు కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ.4.49 లక్షలు ఆర్జిస్తారు. నిజానికి ఈ పథకంలో వడ్డీని ఏటా చక్రవడ్డీ చేస్తారు, దీనికి చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తారు, ఇది పెట్టుబడిదారుడికి వచ్చే మొత్తం రాబడిని మరింత పెంచుతుంది. NSCలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇందులో పన్ను ఆదా అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అవకాశం ఉంది.
NSC ఖాతాను కేవలం భారతీయులు మాత్రమే తెరవగలరు. NRIలు, కంపెనీలు, ట్రస్టులు, HUFలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు కాదు. ఇందులో పొదుపు చేయాలనుకునే వాళ్లు వారి స్వంత పేరుతో లేదా మైనర్ పిల్లల తరపున కూడా ఖాతాను తెరవవచ్చు. అలాగే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.
READ ALSO: James Cameron – Rajamouli: జక్కన్నకు జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్.. ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!