Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కార్మిక చట్టాల (New Labour Rules) అమలుతో భారతీయ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచడం, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడం. పాత నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నో లొసుగులను సరిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణలను తీసుకువచ్చింది.
ముఖ్యంగా వేతన నిర్మాణం మారడం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు మెరుగుపడతాయి. గతంలో కంటే స్పష్టమైన నిబంధనలతో కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచుతూ.. ఉద్యోగుల హక్కులకు పెద్దపీట వేయడం ఈ చట్టాల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ప్రతి ఉద్యోగి తన జీతం, సెలవులు, సెటిల్మెంట్ల విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ కొత్త సౌలభ్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
ఈ కొత్త నిబంధనల వల్ల కలిగే ప్రధాన మార్పులను పరిశీలిస్తే.. మొదటగా వేతన నిర్మాణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. పాత నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 30 శాతం ఉండగా.. కొత్త రూల్స్ ప్రకారం ఇది CTCలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రతి నెలా కట్ అయ్యే పీఎఫ్ (PF) పెరుగుతుంది, ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగికి అందే రిటైర్మెంట్ ఫండ్ మరింత బలంగా ఉంటుంది. గ్రాట్యుటీ విషయంలో కూడా కేంద్రం ఊరటనిచ్చింది. గతంలో 5 ఏళ్లు ఒకే సంస్థలో పని చేస్తేనే వచ్చే గ్రాట్యుటీ, ఇకపై కేవలం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినా లభిస్తుంది.
పని వేళలు , జీతాల చెల్లింపుల్లో కూడా నిబంధనలు కఠినతరం అయ్యాయి. ప్రతి నెలా 10వ తేదీ లోపు వచ్చే జీతం, ఇకపై 7వ తేదీ లోపే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. పని గంటల విషయానికి వస్తే.. వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితిని విధించారు. ఒకవేళ ఎవరైనా రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే (Overtime), వారికి పాత పద్ధతులతో సంబంధం లేకుండా రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఉద్యోగం వదిలేసినప్పుడు ఇచ్చే ‘ఫుల్ అండ్ ఫైనల్’ (F&F) సెటిల్మెంట్ను పాత చట్టాల మాదిరిగా నెలల తరబడి ఆలస్యం చేయకుండా, కేవలం 2 పని దినాల లోపే పూర్తి చేయాలని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. ఇవన్నీ కలిపి ఒక సామాన్య ఉద్యోగికి మెరుగైన ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అమలుకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తుది నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!