Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft’s ‘Rule of 70’: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలపై నీలినీడలు ముసురుకుంటున్న వేళ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర కంపెనీలలాగా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించకుండా, వారికి గౌరవప్రదమైన రీతిలో ‘సెల్ఫ్ రిటైర్మెంట్’ ఆఫర్ను ప్రకటించింది. ఏఐ రాకతో పని భారం తగ్గడం, ఉత్పాదకత పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతోందని భావిస్తున్న మైక్రోసాఫ్ట్, అమెరికాలోని తన సిబ్బందిలో దాదాపు 7 శాతం మందికి స్వచ్ఛంద విరమణ అవకాశం కల్పిస్తోంది. సుమారు 9,000 మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది.
ఏమిటీ ‘రూల్ ఆఫ్ 70’..
మైక్రోసాఫ్ట్ ఈ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఒక ప్రత్యేకమైన ఫార్ములాను రూపొందించింది. దీనినే “రూల్ ఆఫ్ 70” అని పిలుస్తున్నారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగి వయస్సు, ఆ కంపెనీలో వారు పనిచేసిన సంవత్సరాల మొత్తం 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వారు ఈ సెల్ఫ్ రిటైర్మెంట్ ఆఫర్ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి వయస్సు 50 ఏళ్లు ఉండి, మైక్రోసాఫ్ట్లో 20 ఏళ్ల సర్వీస్ ఉంటే (50+20=70), వారు ఈ స్కీమ్కు అర్హులు. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించారు.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
జీతాల పెంపు, బోనస్ నిబంధనల్లోనూ మార్పులు
కేవలం రిటైర్మెంట్ మాత్రమే కాకుండా, కంపెనీ అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా భారీ మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్. ప్రస్తుతం ఉన్న 9 శాలరీ లెవల్స్ను 5కి తగ్గించింది. అలాగే ఉద్యోగుల పనితీరును ఒకరితో ఒకరు పోల్చి చూసే పాత పద్ధతిని తొలగించింది. స్టాక్ రివార్డులను, క్యాష్ బోనస్లను వేరు చేసింది. దీనివల్ల మేనేజ్మెంట్కు వార్షిక వేతనాల చెల్లింపులో మరింత వెసులుబాటు లభిస్తుంది. గత కొద్ది కాలంగా మైక్రోసాఫ్ట్ తన పూర్తి దృష్టిని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణపై పెట్టింది. ఆస్ట్రేలియాలో 18 బిలియన్ డాలర్లు, జపాన్లో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఏఐ పవర్ పెరగడం వల్ల తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతుందని కంపెనీ భావిస్తోంది. అందుకే పెట్టుబడి భారానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించేందుకు ఈ ‘గౌరవప్రదమైన’ మార్గాన్ని ఎంచుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!