Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft’s ‘Rule of 70’: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలపై నీలినీడలు ముసురుకుంటున్న వేళ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర కంపెనీలలాగా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించకుండా, వారికి గౌరవప్రదమైన రీతిలో ‘సెల్ఫ్ రిటైర్మెంట్’ ఆఫర్ను ప్రకటించింది. ఏఐ రాకతో పని భారం తగ్గడం, ఉత్పాదకత పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతోందని భావిస్తున్న మైక్రోసాఫ్ట్, అమెరికాలోని తన సిబ్బందిలో దాదాపు 7 శాతం మందికి స్వచ్ఛంద విరమణ అవకాశం కల్పిస్తోంది. సుమారు 9,000 మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది.
ఏమిటీ ‘రూల్ ఆఫ్ 70’..
మైక్రోసాఫ్ట్ ఈ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఒక ప్రత్యేకమైన ఫార్ములాను రూపొందించింది. దీనినే “రూల్ ఆఫ్ 70” అని పిలుస్తున్నారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగి వయస్సు, ఆ కంపెనీలో వారు పనిచేసిన సంవత్సరాల మొత్తం 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వారు ఈ సెల్ఫ్ రిటైర్మెంట్ ఆఫర్ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి వయస్సు 50 ఏళ్లు ఉండి, మైక్రోసాఫ్ట్లో 20 ఏళ్ల సర్వీస్ ఉంటే (50+20=70), వారు ఈ స్కీమ్కు అర్హులు. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించారు.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
జీతాల పెంపు, బోనస్ నిబంధనల్లోనూ మార్పులు
కేవలం రిటైర్మెంట్ మాత్రమే కాకుండా, కంపెనీ అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా భారీ మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్. ప్రస్తుతం ఉన్న 9 శాలరీ లెవల్స్ను 5కి తగ్గించింది. అలాగే ఉద్యోగుల పనితీరును ఒకరితో ఒకరు పోల్చి చూసే పాత పద్ధతిని తొలగించింది. స్టాక్ రివార్డులను, క్యాష్ బోనస్లను వేరు చేసింది. దీనివల్ల మేనేజ్మెంట్కు వార్షిక వేతనాల చెల్లింపులో మరింత వెసులుబాటు లభిస్తుంది. గత కొద్ది కాలంగా మైక్రోసాఫ్ట్ తన పూర్తి దృష్టిని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణపై పెట్టింది. ఆస్ట్రేలియాలో 18 బిలియన్ డాలర్లు, జపాన్లో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఏఐ పవర్ పెరగడం వల్ల తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతుందని కంపెనీ భావిస్తోంది. అందుకే పెట్టుబడి భారానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించేందుకు ఈ ‘గౌరవప్రదమైన’ మార్గాన్ని ఎంచుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!