Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjeev Bikhchandani: భారతీయ ఇంటర్నెట్ రంగంలో చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం కోట్ల రూపాయల డబ్బును తగలేస్తున్న సమయంలో.. ‘ఇన్ఫో ఎడ్జ్’ (నౌక్రీ.కామ్ మాతృసంస్థ) అధినేత సంజీవ్ బిఖ్చందానీ మాత్రం నిశ్శబ్దంగా భవిష్యత్తు శతాబ్దపు దిగ్గజ కంపెనీలకు పునాది వేస్తున్నారు. 2007 నుంచి ఆయన సుమారు 135 స్టార్టప్లలో రూ.4,900 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ.41,300 కోట్లకు చేరింది. అంటే తన పెట్టుబడిపై దాదాపు 8.4 రెట్ల భారీ లాభాలను అర్జించి సరికొత్త రికార్డు సృష్టించారు. మన నిత్య జీవితంలో భాగమైన జొమాటో (Zomato), పాలసీబజార్ (Policybazaar) వంటి అగ్రశ్రేణి కంపెనీల వెనుక ఉన్న సంజీవ్ బిఖ్చందానీ సక్సెస్ స్టోరీ, ఆయన బిజినెస్ వ్యూహాలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి.
సరైన సమయంలో సరైన పందెం..
కేవలం లాభాల రేటు (IRR) కోసమే కాకుండా, సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచే స్టార్టప్లను గుర్తించడం తన ప్రాథమిక లక్ష్యమని బిఖ్చందానీ స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారుల జీవితాలను మార్చేసే కన్స్యూమర్ టెక్నాలజీ విభాగంలోని 45 కంపెనీలలో ఇన్ఫో ఎడ్జ్ రూ.2,755 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి ప్రస్తుత విలువ రూ.37,214 కోట్లకు చేరింది. జొమాటో విలువ రూ.9.4 కోట్లు, పాలసీబజార్ విలువ రూ.21 కోట్లుగా ఉన్నప్పుడే, భవిష్యత్తులో ఇవి ప్రతి ఇంట్లోనూ అవసరమయ్యే బ్రాండ్లుగా మారుతాయని ఆయన ముందుగానే ఊహించి వీటిలో పెట్టుబడులు పెట్టారు. నేడు ఆ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్లో ప్రధాన పాత్రధారులుగా నిలిచాయి.
Also Read
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
- Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
- IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ఐదేళ్ల క్రితమే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై కన్ను
ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న చాట్జీపీటీ వంటి సాంకేతికత అందుబాటులోకి రాకముందే, ఇన్ఫో ఎడ్జ్ 2020లోనే ఏఐ (AI), డీప్టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా 54 ఏఐ-నేటివ్, డీప్టెక్ కంపెనీలలో రూ.1,003 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. కేవలం ఏఐ రంగంలోని 28 కంపెనీలలో పెట్టిన రూ.614 కోట్ల పెట్టుబడి, ఇప్పుడు రూ.1,268 కోట్లకు చేరింది. ఇందులో 15 స్టార్టప్లు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి వరుసగా నిధులను సాధిస్తూ భారతీయ టెక్ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నాయి. ఇన్ఫో ఎడ్జ్ యొక్క డీప్టెక్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం రిస్క్తో కూడుకున్నది అయినప్పటికీ, భారత ప్రభుత్వ “ఇండియాఏఐ మిషన్”, ఇతర వినూత్న పథకాల వల్ల వీటికి భారీ ఊతం లభిస్తోంది. ఈ విభాగంలోని 30 కంపెనీలలో పెట్టిన రూ.455 కోట్ల పెట్టుబడి ఇప్పుడు రూ.559 కోట్లకు పెరిగింది. వాయిస్ ఏఐ స్టార్టప్ Gnani.ai ప్రభుత్వం నుంచి రూ.177 కోట్ల కంప్యూట్ క్రెడిట్లను పొందింది. దేశంలోని మొట్టమొదటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (RDI) పథకం కింద ePlaneకు రూ.285 కోట్లు, Manastu Spaceకు రూ.115 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇదే సమయంలో వేర్హౌస్ ఆటోమేషన్ రంగంలోని అన్బాక్స్ రోబోటిక్స్ కూడా లాభాల బాట పట్టింది.
‘నౌక్రీ.కామ్’ ఆర్థిక బలమే అసలు సీక్రెట్..
ఇన్ఫో ఎడ్జ్ సాధించిన ఈ అసాధారణ విజయానికి దాని ప్రధాన వ్యాపారమైన Naukri.com నుంచి వచ్చే బలమైన, స్థిరమైన నగదు ప్రవాహమే కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర వెంచర్ క్యాపిటలిస్టుల లాగా పదే పదే బయట మార్కెట్ నుంచి నిధులు సేకరించడానికి సమయం వృథా చేయకుండా, కేవలం సరైన స్టార్టప్లను గుర్తించడంపైనే తమ బృందం దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక బలం తోడ్పడిందని అంటున్నారు. మొత్తం పెట్టుబడిలో రూ.3,600 కోట్లు ఇన్ఫో ఎడ్జ్ సొంత నిధులు కాగా, రూ.1,300 కోట్లు మాత్రమే బయటి పెట్టుబడిదారుల నుంచి సేకరించారు. భారతదేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన దశలోకి ప్రవేశిస్తోందని, రాబోయే రోజుల్లో కేవలం ఇండియా కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం పనిచేసే అతిపెద్ద గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు మన దేశం నుంచే పుట్టుకొస్తాయని సంజీవ్ బిఖ్చందానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!