బిగ్ బాస్ 7 తెలుగులో ఇప్పుడు వరుస ట్విస్ట్ లను చూస్తున్నాం.. మూడు వారాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఆట మొదలైంది..కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని గట్టి పోటీని ఇస్తున్నారు..మూడో పవర్ అస్త్ర సాధించడానికి బిగ్ బాస్ ముగ్గురిని ఎపిక చేశారు.. శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ను ఎపిక చేశాడు బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కు అన్యాయం జరిగింది. శోభా శెట్టి, ప్రియాంక , యావర్ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రకు అనర్హులు అని మీరు అనుకుంటున్నారు. అనర్హులు అనుకున్నవారి ముందు ఉంచిన బామ్మను పగలకొట్టాలి అని ఓ చెత్త టాస్క్ ఇచ్చాడు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటే ఆ ఇద్దరమ్మాయిలో ఈ అబ్బాయి పేరు చెప్పి అతడిని తప్పిస్తారని తెలిసి కూడా ఈ టాస్క్ఇచ్చాడు..
ముందుగా ఊహించినట్లే యావర్, శోభా శెట్టిని టాస్క్ నుంచి తప్పించారు… యావర్ నేను పనికి రాను అంటు బోరున ఏడ్చారు..మూడో పవర్ అస్త్ర పొందడానికి ప్రియాంక, శోభా శెట్టి గట్టిగా పోటీపడ్డారు. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి సింపుల్ గా బుల్ రైడ్ టాస్క్ ఇచ్చాడు. ఈ ఎద్దు బొమ్మపై ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారే విన్నర్ అని. విన్ అయినా వారు మూడో పవర్ అస్త్రను చేసుకుంటారని, అలాగే ఈ పవర్ అస్త్రాను గెలిచినా వాళ్లు మూడు వారాలు ఎలిమినేషన్ లో ఉండరని బిగ్ బాస్ చెప్పడంతో ఇద్దరు గట్టి పోటీని ఇచ్చారు..
అయితే ఈ టాస్క్ ఓ ప్రియాంక జైన్ బుల్ ను పట్టుకొని ఎక్కువ సేపు ఆట ఆడింది. బుల్ తిరుగుతున్నా కూడా పట్టు వదలకుండా దాన్ని గట్టిగా పట్టుకొని చాలా సేపు ఆ ఎద్దు పై ఉంది. ఆతర్వాత రంగంలోకి వచ్చిన శోభా శెట్టి కూడా చాలా సేపు ఎద్దు పై ఉంది. ఇద్దరు ఈ టాస్క్ లో గట్టిగానే పోటీపడ్డారు. అయితే శోభా కంటే ప్రియాంక జైన్ ఎక్కువ సేపు బుల్ పై రైడ్ చేసింది. అయితే ప్రియాంక విన్నర్ అని అంతా అనుకునే సమయంలో ఎంబీగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరో ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున చెప్పనున్నాడు.. ఇక ఈ వారం ఇంటి నుంచి దామిని బయటకు వెళ్తుందని సమాచారం..