Site icon NTV Telugu

Navaratri : శ్రీ దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న పెద్దమ్మ తల్లి..

Peddamma Thalli

Peddamma Thalli

నవ రాత్రులు చాలా ప్రత్యేకం.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల ను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. ఈ క్రమంలోని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే.. అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి..

ఈ నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది.. అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.

ఈరోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూల తో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు.. దశమి రోజే ఆయుధ పూజ కూడా ఉంటుంది.. దశమి రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు అందిస్తారు..

Exit mobile version