Site icon NTV Telugu

Navaratri : పెద్దమ్మ తల్లి గుడిలో శ్రీ లలితాదేవి అలంకరణలో అమ్మవారు..

Peddamma Talli Hyderabad Junilee Hills

Peddamma Talli Hyderabad Junilee Hills

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది..

అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు నిన్న అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. ఈరోజు గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.. ఈ అవతారంలో అమ్మవారికి ప్రత్యేకత ఉంది..

శ్రీ లలితా దేవిగా అమ్మవారు ఉదయం ను దర్శనమిస్తున్నారు.. ఈరోజు అమ్మవారు బంగారు రంగుచీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే మంచిది. అమ్మవారికి నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెట్టాలి. సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజ చేయడం వీలు పడని వారు మొదటి మూడు రోజులు లేదా తరువాత మూడు రోజులు లేదా చివరి మూడురోజులు పూజిస్తారు. ఈరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానినికి తరలివస్తున్నారని అధికారులు చెబుతున్నారు..

Exit mobile version