భద్రాచలం వెళ్ళినవారు నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటో వివరించారు చాగంటి వారు. భద్రాచలం వెళ్ళి వచ్చాను అంటే… భగవంతుడు మీద అచంచలమయిన విశ్వాసం కలుగుతుంది. ప్రతి భక్తుడు భద్రుడు లాంటివాడు. నా తలమీద శ్రీరాముడు కూర్చున్నాడని అంతా భావించాలి. కారణ జన్ములు కొందరు ఉంటారు. భక్తి అనేది జీవితంలో ప్రారంభం కావాలి. ఎవరి యోగ్యత ఎప్పుడు వస్తుందో తెలీదు. భద్రాచలం వెళితే అనేకం నేర్చుకోవచ్చు. పోకలదమ్మక్కకు రాముడు దర్శనం ఇచ్చాడు. కొండమీద ఉన్న నన్ను వెతికి, పందిరేసి, పూజచేసి, నైవేద్యం పెట్టమని రాముడు కోరాడు. ఆమెకు నమ్మకం ఉంది. కొండమీద వెతికితే రాముడు కనిపించాడు. మనం కూడా వెతకాలి. భద్రాచలం వెళ్ళినవారు నమ్మకం పెంచుకోవాలి.