Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?

  • పజెరో మళ్లీ రానుందా?
  • 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్
  • 2031 నాటికి 13 కొత్త వాహనాలు
Mitsubishi Pajero

Mitsubishi Pajero

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మిత్సుబిషి భారత మార్కెట్లో తన కార్ల విక్రయాలను నిలిపివేసినప్పటికీ, కంపెనీకి చెందిన వాహనాలకు ఇప్పటికీ సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పజెరో SUV తన ఆఫ్-రోడ్ సామర్థ్యం, డాకర్ ర్యాలీ వారసత్వం, దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఆటోమొబైల్ అభిమానులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఈ ఐకానిక్ SUV తిరిగి రానుందనే సంకేతాలను మిత్సుబిషి అధికారికంగా ఇచ్చింది.

పజెరో, మాంటెరో పునరాగమనం ఖాయం

×
×
Ad

మిత్సుబిషి తన సోషల్ మీడియా వేదికల ద్వారా “Pajero/Montero is ready to write its next chapter” అనే సందేశంతో పజెరో, మాంటెరో బ్రాండ్ల పునరాగమనాన్ని ధృవీకరించింది. కంపెనీ విడుదల చేసిన రోడ్‌మ్యాప్ ప్రకారం, పజెరో పేరు ఇకపై ఒక్క మోడల్‌కే పరిమితం కాకుండా పూర్తి స్థాయి SUV బ్రాండ్‌గా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండు కొత్త SUVలపై పని

మిత్సుబిషి చివరిసారిగా 2021లో పజెరో పేరును ఉపయోగించింది. ఇప్పుడు ఆ పేరును కొత్త తరం మోడళ్లతో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజా ప్రణాళికల ప్రకారం, కనీసం రెండు కొత్త పజెరో SUVలు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి ప్రీమియం ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కూడిన లాడర్-ఫ్రేమ్ SUVగా ఉండే అవకాశం ఉంది.

డిజైన్ ఎలా ఉండొచ్చు?

టీజర్ చిత్రాల ఆధారంగా చూస్తే, కొత్త పజెరో SUVకు మిత్సుబిషి ట్రైటాన్ పికప్ ట్రక్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను అందించే అవకాశం ఉంది.

ప్రధాన డిజైన్ హైలైట్స్

కనెక్టెడ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs)
మధ్యలో మిత్సుబిషి లోగో
బాక్సీ మరియు మస్క్యులర్ SUV డిజైన్
సాంప్రదాయ ఆఫ్-రోడ్ SUV స్టాన్స్
పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్. ఈ డిజైన్ SUVకి మరింత రగ్గడ్, ప్రీమియం లుక్‌ను అందించనుంది.

ఇంజిన్ ఎంపికలు

అంతర్జాతీయ మార్కెట్ల కోసం మిత్సుబిషి కొత్త పజెరోలో పలు పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే అవకాశం ఉంది.

పెట్రోల్ ఇంజిన్
డీజిల్ ఇంజిన్
పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్, అలాగే కొన్ని మార్కెట్లలో మాంటెరో పేరుతో ఈ SUVను విక్రయించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

2031 నాటికి 13 కొత్త వాహనాలు

మిత్సుబిషి విడుదల చేసిన FY2026–FY2031 రోడ్‌మ్యాప్ ప్రకారం, కంపెనీ రాబోయే సంవత్సరాల్లో 13 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ జాబితాలో:

కీ కార్లు
కీ ఎలక్ట్రిక్ వాహనాలు (BEVs)
పికప్ ట్రక్కులు
రెండు ఎలక్ట్రిక్ SUVలు
కొత్త తరం ఎక్స్‌పాండర్
ఆఫ్-రోడ్‌కు అనువైన ప్రత్యేక మోడళ్లు వంటి వాహనాలు ఉన్నాయి.

భారత మార్కెట్లోకి వస్తుందా?

ప్రస్తుతం పజెరో భారత మార్కెట్లో తిరిగి ప్రవేశిస్తుందా లేదా అనే విషయంపై మిత్సుబిషి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే SUVలపై పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, భవిష్యత్తులో భారత మార్కెట్లో కూడా ఈ బ్రాండ్ మళ్లీ కనిపించే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేము.