వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజధానిపై చర్చనీయాంశంగా మారాయి. బొత్స మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అని అన్నామని బొత్స తెలిపారు. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చుపెట్టే స్థోమత లేదని అన్నారు. అందుకే అమరావతి స్మశానంలా ఉందని అన్నాం.. ఇందులో ఎలాంటి వివాదం లేదని బొత్స స్పష్టం చేశారు.
Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..
- రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు
- రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది
- మేము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చుపెట్టే స్థోమత లేదని అన్నారు
- రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం

Bothsa