NTV Telugu Site icon

Adusumilli Jayaprakash: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి కన్నుమూత.. కుటుంబానికి జగన్‌ పరామర్శ

Adusumilli

Adusumilli

Adusumilli Jayaprakash: విజయవాడ తూర్పు నియోజకర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌ కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 ఏళ్లు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు.. ఆయనకు భార్య పద్మ, కుమారుడు తిరుమలేష్, కుమార్తె సాయినందన ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నులో తిరుమలరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు 1952లో జన్మించారు జయప్రకాశ్.. 1983-1985 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలు అందించారు.. కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు అడుసుమిల్లి జయప్రకాశ్‌..

Read Also: India vs Bangladesh: సెంచరీలతో అదరగొట్టిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515

ఇక, అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. జయప్రకాష్‌ కుమారుడు తిరుమలేష్‌తో ఫోన్‌లో మాట్లాడి.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్రవేసుకున్నారని కొనియాడారు.. జయప్రకాష్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు వైఎస్‌ జగన్‌..