Vijayawada: ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం..

  • ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం
  • శిలాఫలకం దగ్గర అమిత్ షాకు, చంద్రబాబుకు కుర్చీలు
  • మూడో కుర్చీ తీసుకురమ్మని ఆదేశించిన అమిత్ షా
  • పవన్ కల్యాణ్ ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్న కేంద్ర మంత్రి.
Pawan Amit Sha

Pawan Amit Sha

విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు. అది గమనించిన అమిత్ షా.. మరొక కూర్చీ తీసుకురావాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పక్కన కూర్చీలో కూర్చోమ్మని చెప్పారు. ఈ వీడియోను జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పవన్ కల్యాణ్‌కు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.